రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది.

Update: 2023-06-23 13:41 GMT

దిశ, మేడ్చల్ టౌన్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం మేడ్చల్ మండలంలోని అర్కెలగుడెం గ్రామం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వద్ద కూరగాయల ఆటోని డీసీఎం ఢీ కొట్టింది. దీంతో ముడిచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామం చెందిన జయేందర్ రెడ్డి (60) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Tags:    

Similar News