ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని మద్దుల చెరువు సమీపంలో చోటుచేసుకుంది.

Update: 2023-05-15 15:28 GMT

దిశ, కోరుట్ల టౌన్ : ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని మద్దుల చెరువు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని చిన్నతోట వాడకు చెందిన జిల్లా రాజు (42) పట్టణంలోని మద్దుల చెరువు సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజు మృతికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. మృతుడికి భార్య, ఓ కూతురు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిర్ర సతీష్ కుమార్ తెలిపారు. 

Tags:    

Similar News