నీటి విషయంలో గొడవ.. ఆర్మీ జవాన్‌ను హత్య చేసిన కౌన్సిలర్

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రభాకరన్ అనే ఆర్మీ జవాన్‌ను దుండగులు కిరాతకంగా హత్య చేశారు.

Update: 2023-02-15 13:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రభాకరన్ అనే ఆర్మీ జవాన్‌ను దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఇంటి దగ్గర నీటి విషయంలో స్థానిక కౌన్సిలర్‌తో జవాన్ ప్రభాకరన్‌కు వివాదం తలెత్తింది. కాగా, ఈ ఘర్షణ పెద్దగా కావడంతో ఆగ్రహంతో రగిలిపోయిన కౌన్సిలర్ చిన్నస్వామి, అతడి అనుచరులు జవాన్ ప్రభాకరన్‌పై విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రభాకరన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీంతో ప్రభాకరన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జవాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 

Also Read...

ప్రియుడు చేతిలో హత్యకు గురైన ఢిల్లీ యువతి: చివరి వీడియో ఇదే..!

Tags:    

Similar News