కౌడిపల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్

నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మదర్ నేతృత్వంలో కౌడిపల్లిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

Update: 2023-01-31 16:25 GMT

దిశ, కౌడిపల్లి : జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు కమ్యూనిటీ కనెక్ట్ లో భాగంగా మంగళవారం కౌడిపల్లి లోని కొత్త కాలనీలో నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మదర్ నేతృత్వంలో కౌడిపల్లి నర్సాపూర్ ఎస్సైలు శివప్రసాద్ రెడ్డి, గంగరాజు 30 మంది పోలీస్ సిబ్బంది కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చ్ లో భాగంగా 23 బైకులు, ఒక ఆటో కు సంబంధించి సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు నర్సాపూర్ సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ షేక్ లాల్ మదర్ మాట్లాడుతూ.. కమ్యూనిటీ కనెక్ట్ ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజలకు చేరువ కావడమన్నారు. ప్రజల్లోని అపోహలను తొలగించడానికి కమ్యూనిటీ కనెక్ట్ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. అలాగే సీసీ కెమెరాలు ఉపయోగం, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Similar News