మావోయిస్టుల మందుపాతర పేలి కానిస్టేబుల్​కు గాయాలు

మావోయిస్టులు పెట్టిన మందుపాతర పేలి ఓ కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలయ్యాయి.

Update: 2023-03-30 15:39 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలీసులను టార్గెట్​గా చేసుకుని మావోయిస్టులు పెట్టిన మందుపాతర పేలి ఓ కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఛత్తీస్​ఘడ్​ రాష్ర్టం బీజాపూర్​ జిల్లా నెల్సనార్ ​పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. రాష్ట్ర రహదారి అయిన పాండే మార్గ్​ పక్కన మావోయిస్టులు మందుపాతర పెట్టారన్న సమాచారం మేరకు గురువారం ఉదయం సీఆర్పీఎఫ్ బాంబ్​డి స్పోజల్​ స్క్కాడ్ ​అక్కడికి వెళ్లింది. బృందంలోని రవికుమార్​ అనే కానిస్టేబుల్​ మావోయిస్టులు పెట్టిన ఐఈడీ బాంబును నిర్వీర్యం చేస్తుండగా అది పేలిపోయింది. తీవ్రంగా గాయపడ్డ రవికుమార్​ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ​

Tags:    

Similar News