బ్రేకింగ్: ఘోర ప్రమాదం.. 70 మీటర్ల లోయలో ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డెహ్రాడూన్ - ముస్సోరీ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ఆదివారం 70 మీటర్ల లోయలో పడిపోయింది.

Update: 2023-04-02 10:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డెహ్రాడూన్ - ముస్సోరీ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ఆదివారం 70 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కకడే మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సహయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News