బ్రేకింగ్: ప్రార్థన మందిరంలో ఉగ్రవాదుల కాల్పులు.. అక్కడికక్కడే 7గురు మృతి
ఇజ్రాయెల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం ఉదయం ఒక్కసారిగా జెరూసలెంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
దిశ, వెబ్డెస్క్: ఇజ్రాయెల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం ఉదయం ఒక్కసారిగా జెరూసలెంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. యాద్ ప్రార్థనా మందిరం సినగోగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటన స్థలానికి చేరుకుని సినగోగ్ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.