మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

Update: 2022-08-30 12:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో ఆయన మంగళవారం టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కేటీఆరే ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. దీంతో మంత్రి అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. 

Tags:    

Similar News