పటాన్‌చెరు ఎమ్మెల్యేకు కరోనా

దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన నగరంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే తల్లి మాణెమ్మ, సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, డ్రైవర్ కిరణ్, పీఏ వినోద్ లకు కూడా కరోనా సోకింది. ఎమ్మెల్యేకు తొలుత కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కుటుంబీకులు, సిబ్బంది పరీక్షలు చేయించుకోగా వారికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలిసి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, […]

Update: 2020-08-03 03:20 GMT

దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన నగరంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే తల్లి మాణెమ్మ, సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, డ్రైవర్ కిరణ్, పీఏ వినోద్ లకు కూడా కరోనా సోకింది.

ఎమ్మెల్యేకు తొలుత కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కుటుంబీకులు, సిబ్బంది పరీక్షలు చేయించుకోగా వారికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలిసి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి త్వరగా కోలుకోవాలని భగవంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News