సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డికి కరోనా పాజిటివ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్య జనాలే కాకుండా అనేక ప్రముఖులు మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేగాకుండా.. ఇటీవల తనను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, వీలైతే వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లాలని […]

Update: 2021-04-29 01:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్య జనాలే కాకుండా అనేక ప్రముఖులు మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేగాకుండా.. ఇటీవల తనను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, వీలైతే వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లాలని సూచించారు. మహమ్మారి ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని, వ్యక్తిగత జాగ్రత్తలు చాలా ముఖ్యం అని అన్నారు.

Tags:    

Similar News