తెలుగు ఇండస్ట్రీలో కరోనా కలకలం.. సినీ ప్రముఖుడికి కరోనా పాజిటివ్

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటి వరకే చాలా మంది సినీ ప్రముఖులకు కరోనా తో ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే తాజాగా సినీ ప్రముఖుడు మరొకరు కరోనా బారినపడ్డారు. నటుడు పోసాని కృష్ణమురళికి ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో తాను పరీక్షలు […]

Update: 2021-07-29 22:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటి వరకే చాలా మంది సినీ ప్రముఖులకు కరోనా తో ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే తాజాగా సినీ ప్రముఖుడు మరొకరు కరోనా బారినపడ్డారు. నటుడు పోసాని కృష్ణమురళికి ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో తాను పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అయితే పోసానికి కరోనా పాజిటివ్ నిర్ధరాణ కావడంతో ఆయన నటిస్తున్న రెండు సినిమాల షూటింగ్స్ వాయిదా పడినట్టు సమాచారం. తన కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంపై స్పందిచిన పోసాని.. కలిగిన అసౌకర్యం పట్ల దర్శక నిర్మాతలు, హీరోలను ఆయన క్షమించాలని కోరారు. అందరి ఆశీస్సులతో తొందరగా కరోనా నుంచి కోలుకుని మళ్లీ షూటింగ్ లో పాల్గొంటానని పోసాని తెలిపారు.

Tags:    

Similar News