వామ్మో ఒకే రోజు అన్ని కేసులా.. కుత్బుల్లాపూర్ ను కుదిపేస్తున్న కరోనా

దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కరోనా స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు నెలలో ఒకరిద్దరికి మాత్రమే వచ్చేది. అయితే శుక్రవారం ఈ మహమ్మారి కుత్బుల్లాపూర్ ను కుదిపేసింది. బహదూర్ పల్లి లోని టెక్ మహీంద్రా యూనివర్సిటీ లో ఓ విద్యార్థికి కరోనా ఉందనే అనుమానంతో పరీక్షలు చేశారు. ఇలా ఆ విద్యార్థిని కలిసిన వారందరినీ పరీక్షలు చేయడం ప్రారంభించారు. మొత్తం 25 మంది విద్యార్థులతో పాటు ఐదుగురు అధ్యాపకులకు కరోనా సోకినట్లు వైద్యాధికారిని నిర్మల […]

Update: 2021-11-26 12:01 GMT

దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కరోనా స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు నెలలో ఒకరిద్దరికి మాత్రమే వచ్చేది. అయితే శుక్రవారం ఈ మహమ్మారి కుత్బుల్లాపూర్ ను కుదిపేసింది. బహదూర్ పల్లి లోని టెక్ మహీంద్రా యూనివర్సిటీ లో ఓ విద్యార్థికి కరోనా ఉందనే అనుమానంతో పరీక్షలు చేశారు.

ఇలా ఆ విద్యార్థిని కలిసిన వారందరినీ పరీక్షలు చేయడం ప్రారంభించారు. మొత్తం 25 మంది విద్యార్థులతో పాటు ఐదుగురు అధ్యాపకులకు కరోనా సోకినట్లు వైద్యాధికారిని నిర్మల తెలిపారు. ఈ నేపద్యంలో కళాశాలకు పూర్తిగా సెలవు ప్రకటించారు.

Tags:    

Similar News