దేశంలో కేసులు తగ్గుతున్నాయ్.. కానీ : కేంద్రం

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, మరణాల రేటు మాత్రం ఆందోళనకరంగానే ఉందని వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో రోజుకు వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు […]

Update: 2021-05-27 06:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, మరణాల రేటు మాత్రం ఆందోళనకరంగానే ఉందని వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో రోజుకు వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 90శాతానికి పెరిగిందని వివరించారు. ఇప్పటివరకు 20.26కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తైందని స్పష్టంచేశారు.

Tags:    

Similar News