GOOD NEWS : వంట నూనె ధరలు తగ్గాయ్

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా పాండమిక్ తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా వంటనూనెల ధరలు భగ్గుమన్నాయి. లీటర్ వంటనూనె రూ.150 నుంచి 160 వరకు చేరుకోవడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల వంటనూనెలపై కేంద్రం ఎక్సైజ్ సుంఖం తగ్గించడంతో మేజర్ ఎడిబుల్ ఆయిల్ సంస్థలు ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. అదానీ విల్మర్, రుచి సోయా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ఆయిల్ ధరలను లీటరుకు రూ.4 నుంచి 7 వరకు తగ్గిస్తున్నట్టు తెలిపాయి. […]

Update: 2021-11-02 20:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా పాండమిక్ తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా వంటనూనెల ధరలు భగ్గుమన్నాయి. లీటర్ వంటనూనె రూ.150 నుంచి 160 వరకు చేరుకోవడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల వంటనూనెలపై కేంద్రం ఎక్సైజ్ సుంఖం తగ్గించడంతో మేజర్ ఎడిబుల్ ఆయిల్ సంస్థలు ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి.

అదానీ విల్మర్, రుచి సోయా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ఆయిల్ ధరలను లీటరుకు రూ.4 నుంచి 7 వరకు తగ్గిస్తున్నట్టు తెలిపాయి. మిగతా కంపెనీలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తాయని SEA తెలిపింది. జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా(హైదరాబాద్)తో పాటు ఇతర నగరాలకు చెందిన కొన్ని ముఖ్యమైన ఆయిల్ కంపెనీలు ధరలు తగ్గించినట్టు తెలుస్తోంది. పండుగ ఫూట ఆయిల్ ధరలు తగ్గడం అనేది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరటనిచ్చే అంశం.

Tags:    

Similar News