పెట్రో మంట.. జూన్ 11న కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

దిశ, వెబ్‌డెస్క్ : ఇంధన ధరలు దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెట్రో ధరలు సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. నిరసనల్లో భాగంగా జూన్ 11న పెట్రోల్​ బంక్‌ల ఎదుట కాంగ్రెస్​ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెరుగుతున్న పెట్రో ధరలపై కేంద్రాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో […]

Update: 2021-06-08 23:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇంధన ధరలు దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెట్రో ధరలు సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. నిరసనల్లో భాగంగా జూన్ 11న పెట్రోల్​ బంక్‌ల ఎదుట కాంగ్రెస్​ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టనున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెరుగుతున్న పెట్రో ధరలపై కేంద్రాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో సామాన్య ప్రజలపై పెట్రో ధరల పెరుగుదల కారణంగా మరింత భారం పడుతుందని ఆరోపించారు.

Tags:    

Similar News