ఎంఐఎం అడ్డుకున్నా పర్యటిస్తా : షబ్బీర్ అలీ

దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాతబస్తీలో ఎంఐఎం దాదాగిరి కొనసాగిస్తోందని విమర్శించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు వెళ్తే దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో జరిగిన కబ్జాలపై మంత్రి కేటీఆర్ విచారణ జరిపించాలని కోరారు. పాతబస్తీలో కబ్జాలు ఎంఐఎం నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కబ్జాల కారణంగానే పాతబస్తీని వరదలు ముంచెత్తాయని తెలిపారు. ఎంఐఎం అడ్డుకున్నా పాతబస్తీలో పర్యటిస్తామని […]

Update: 2020-10-19 03:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాతబస్తీలో ఎంఐఎం దాదాగిరి కొనసాగిస్తోందని విమర్శించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు వెళ్తే దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో జరిగిన కబ్జాలపై మంత్రి కేటీఆర్ విచారణ జరిపించాలని కోరారు. పాతబస్తీలో కబ్జాలు ఎంఐఎం నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కబ్జాల కారణంగానే పాతబస్తీని వరదలు ముంచెత్తాయని తెలిపారు. ఎంఐఎం అడ్డుకున్నా పాతబస్తీలో పర్యటిస్తామని అన్నారు.

Tags:    

Similar News