కార్తీ చిదంబరానికి కరోనా

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎంపీ, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సోమవారం కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను కలిసినవారూ తప్పకుండా మెడికల్ ప్రొటోకాల్ అనుసరించాలని కోరారు. తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని తెలిపారు. కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత ఇవాన్ డిసౌజా, అతని భార్య శనివారం వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే పీసీ […]

Update: 2020-08-03 04:22 GMT

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎంపీ, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సోమవారం కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను కలిసినవారూ తప్పకుండా మెడికల్ ప్రొటోకాల్ అనుసరించాలని కోరారు. తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని తెలిపారు.

కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత ఇవాన్ డిసౌజా, అతని భార్య శనివారం వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే పీసీ శర్మ, అభిషేక్ సింఘ్వీలకూ ఇటీవలే వైరస్ పాజిటివ్‌గా తేలింది. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, కర్ణాటక సీఎం యడియూరప్ప, తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌లకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం విదితమే.

Tags:    

Similar News