రెండ్రోజుల్లో పూర్తి కావాలి : కలెక్టర్

దిశ, సిద్ధిపేట: కార్తీక మాసంలోనే సీఎం కేసీఆర్ చేత కొత్త కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, నర్సాపూర్‌లో నిర్మించిన గృహా ప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోనున్నట్టు జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి చెప్పారు. సోమవారం సిద్ధిపేట జిల్లా దుద్దెడ గ్రామ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పలువురు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి, రెండ్రోజుల్లో ప్రారంభోత్సవ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బ్లాకుల […]

Update: 2020-11-16 08:06 GMT

దిశ, సిద్ధిపేట: కార్తీక మాసంలోనే సీఎం కేసీఆర్ చేత కొత్త కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, నర్సాపూర్‌లో నిర్మించిన గృహా ప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోనున్నట్టు జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి చెప్పారు. సోమవారం సిద్ధిపేట జిల్లా దుద్దెడ గ్రామ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పలువురు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి, రెండ్రోజుల్లో ప్రారంభోత్సవ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బ్లాకుల వారీగా, అన్నీ శాఖలకు జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సమక్షంలో గదులను కేటాయింపు చేశారు. అంతకు ముందు కలెక్టరేట్ భవనంలోని కార్యాలయాల సుముదాయాల గదులను బ్లాకులు, అంతస్తుల వారీగా పరిశీలిస్తూ.. కలెక్టరేట్ కలియ తిరిగారు. పలుచోట్ల అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

Tags:    

Similar News