నేడు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకుంటోన్న సమయంలో లాక్‌డౌన్ పొడిగింపు లేదా తగ్గిపు విషయమై ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సడలింపుల గురించి కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. గ్రీన్‌జోన్లలో ప్రజారవాణా, వలస కూలీల సమస్యలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న కరోనా పాజిటివ్ కేసులపై, కరోనా టెస్టులపై సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పరిశ్రమలు తెరవడం, […]

Update: 2020-05-14 21:03 GMT

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకుంటోన్న సమయంలో లాక్‌డౌన్ పొడిగింపు లేదా తగ్గిపు విషయమై ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సడలింపుల గురించి కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. గ్రీన్‌జోన్లలో ప్రజారవాణా, వలస కూలీల సమస్యలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న కరోనా పాజిటివ్ కేసులపై, కరోనా టెస్టులపై సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పరిశ్రమలు తెరవడం, పదో తరగతి పరీక్షలపై కూడా ఇవాళ సీఎం తుది నిర్ణయం వెలువడనుంది. ఈ సమీక్షలో కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో సమగ్ర వ్యవసాయ విధానంపై కూడా చర్చ జరుగనుంది.

Tags:    

Similar News