రాష్ట్రాన్ని అత్యాచారాంధ్రప్రదేశ్‌గా మార్చారు: అనిత

దిశ,విశాఖపట్నం: రాష్ట్రాన్ని అత్యాచారాంధ్రప్రదేశ్‌గా సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖలో ఆదివారం ఆమె మాట్లాడుతూ… సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందులలోని లింగాల మండలంలోని పెదకూడాల గ్రామంలో 48ఏండ్ల దళిత మహిళ పై అతిదారుణంగా అత్యాచారం జరిగితే, వైసీపీ మహిళానేతలు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. 18నెలల జగన్ పాలనలో అధికారిక లెక్కల ప్రకారమే రోజూ ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని […]

Update: 2020-12-13 06:44 GMT

దిశ,విశాఖపట్నం: రాష్ట్రాన్ని అత్యాచారాంధ్రప్రదేశ్‌గా సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖలో ఆదివారం ఆమె మాట్లాడుతూ… సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందులలోని లింగాల మండలంలోని పెదకూడాల గ్రామంలో 48ఏండ్ల దళిత మహిళ పై అతిదారుణంగా అత్యాచారం జరిగితే, వైసీపీ మహిళానేతలు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.

18నెలల జగన్ పాలనలో అధికారిక లెక్కల ప్రకారమే రోజూ ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. తన సొంత నియోజకవర్గంలో దళిత మహిళపై అత్యాచారం చేసి, చంపేస్తే ముఖ్యమంత్రి పట్టించుకోరా? ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగిన దారుణంపై చంద్రబాబు, డీజీపీకి లేఖరాస్తే, ఇంతవరకు స్పందన లేదన్నారు.

ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నల్లిని నలిపినట్లు నలిపేసిందన్నారు. వైసీపీవారు చెప్పింది చేయడానికే పోలీసులు పరిమితమయ్యారని ఆరోపించారు. నిబద్ధత, జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే, రాష్ట్రంలో నేరాలశాతం పెరిగిందని తీవ్రంగా విమర్శించారు. నిత్యం ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే, మహిళా హోంమంత్రి, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్, వైసీపీ మహిళా నేతలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News