స్నేహితుడి కుటుంబానికి పూర్వవిద్యార్థుల అపూర్వ కానుక

భువనగిరి రూరల్ : కరోనాతో మృతిచెందిన స్నేహితుడి కుటుంబానికి పూర్వ విద్యార్థులు ఆసరాగా నిలిచారు. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన మిత్రుడు అకాల మృతితో ఒంటరైన ఆయన పిల్లలకు బాసటగా నిలిచారు. ఆర్థికసాయం చేసి మీకు అండగా మేముంటాం అని భరోసానిచ్చారు. వలిగొండకు చెందిన టీవీ జర్నలిస్ట్ గిరిబాబు ఇటీవల కరోనాతో మృతిచెందాడు. దీంతో అతడితో పదో తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థులు అంతా కలిసి రూ.2,20,501లక్షలను గిరిబాబు కుమార్తెలు సుప్రియ, హానిప్రియకు అందించారు. […]

Update: 2021-06-20 03:18 GMT

భువనగిరి రూరల్ : కరోనాతో మృతిచెందిన స్నేహితుడి కుటుంబానికి పూర్వ విద్యార్థులు ఆసరాగా నిలిచారు. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన మిత్రుడు అకాల మృతితో ఒంటరైన ఆయన పిల్లలకు బాసటగా నిలిచారు. ఆర్థికసాయం చేసి మీకు అండగా మేముంటాం అని భరోసానిచ్చారు.

వలిగొండకు చెందిన టీవీ జర్నలిస్ట్ గిరిబాబు ఇటీవల కరోనాతో మృతిచెందాడు. దీంతో అతడితో పదో తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థులు అంతా కలిసి రూ.2,20,501లక్షలను గిరిబాబు కుమార్తెలు సుప్రియ, హానిప్రియకు అందించారు. ఇద్దరు ఆడపిల్లలు చిన్నారులైనందున వారి చదువుకు చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ సహాయం కావాల్సిన మేమున్నామని, మా క్లాస్‌మెంట్స్ మొత్తం ఎల్లవేళల సహాయం చేసుందుకు ముందుంటామని గిరిబాబు భార్య మాధవికి భరోసానిచ్చారు. ధైర్యంగా ఉండి పిల్లలను ఉన్నత చదువులు చదివించి గిరిబాబు కలను సాకారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మిర్యాల భాస్కర్, పిట్టల రుశికేశావులు, గంజి రాంప్రసాద్, జగన్, మోహన్ రెడ్డి, శ్యాం సుందర్, మహేష్, భద్రి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News