లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీజేఐ ఎన్‌వీ రమణ..

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఎన్‌వీ రమణ సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఎన్‌వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఎన్‌వీ రమణ ఆలయ పునర్‌ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి […]

Update: 2021-06-14 22:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఎన్‌వీ రమణ సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఎన్‌వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఎన్‌వీ రమణ ఆలయ పునర్‌ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆలయ సందర్శనకు రావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎన్‌వీ రమణ పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags:    

Similar News