వైద్యులతో చంద్రబాబు వర్చువల్ సమావేశం

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమై కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇదే క్రమంలో ప్రభుత్వంపై తీవ్రవిమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు శనివారం వైద్యులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. కరోనా తీవ్రత, జాగ్రత్తలపై వైద్యులతో చర్చించారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, గత రెండు వారాల నుంచి దేశంలో కరోనా వృద్ధిరేటు విపరీతంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరణాల్లోనూ దేశంలో ఏపీ రెండో […]

Update: 2020-07-25 04:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమై కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇదే క్రమంలో ప్రభుత్వంపై తీవ్రవిమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు శనివారం వైద్యులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. కరోనా తీవ్రత, జాగ్రత్తలపై వైద్యులతో చర్చించారు.

కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, గత రెండు వారాల నుంచి దేశంలో కరోనా వృద్ధిరేటు విపరీతంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరణాల్లోనూ దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. ఎక్కువమందిని ఒకే అంబులెన్స్‌లో తరలించడం వల్ల పాజిటివ్ లేని వారికి సైతం పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

Tags:    

Similar News