పంచవర్ష ప్రణాళికలను ఆమోదించేది..??

పరిపాలన ట్రిబ్యునళ్ల గురించే తెలిపే ఆర్టికల్Important Bits in Polity

Update: 2022-03-19 08:05 GMT

*పరిపాలన ట్రిబ్యునళ్ల గురించే తెలిపే ఆర్టికల్ - 323ఎ

*42వ రాజ్యాంగ సవరణ ద్వారా పరిపాలన ట్రిబ్యునళ్లను రాజ్యాంగంలో చేర్చారు. 

*అంతరాష్ట్ర నది జల వివాదాలపై టిబ్యునల్స్ ఏర్పాటు చేయడానికి వీలు కల్పించే ఆర్టికల్- 262

*సెంట్రల్ ఆడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను 1985లో చేర్చారు. 

*గవర్నర్లను రాష్ట్రపతి నియమించే విధానం కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించారు. 

*ఉత్తర జోనల్ కౌన్సిల్ ప్రధాన కేంద్రం- న్యూఢిల్లీ

*జోనల్ కౌన్సిల్ ఏర్పాటు గురించి సిఫార్సు చేసిన కమిషన్- ఫజల్ అలీ కమిషన్

*జోనల్ కౌన్సిళ్లను రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ద్వారా ఏర్పాటు చేశారు. 

*జోనల్ కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహించేది- కేంద్ర హోంమంత్రి

*దక్షిణాది జోనల్ కౌన్సిల్ ప్రధాన కేంద్రం - చెన్నై

*జాతీయాభివృద్ధి మండలి అధ్యక్షుడు - ప్రధానమంత్రి

*ముసాయిదా ప్రణాళికను జాతీయాభివృద్ధి మండలి ఆమోదిస్తుంది. 

*జాతీయాభివృద్ధి మండలి స్థాపించన సంవత్సరం- 1952

*జాతీయాభివృద్దిని సూపర్ కేబినెట్ గా అభివర్ణించింది-సంతానం కమిటీ

*పంచవర్ష ప్రణాళికలను ఆమోదించేది- జాతీయాభివృద్ధి మండలి

*లోకాయుక్తను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం- ఒడిశా

*లోక్ పాల్ వ్యవస్థను స్వీడన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. 

*లోకాయుక్త తన నివేదికను గవర్నకు సమర్పిస్తుంది. 







Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News