రెపోరేటు 35 బేసిస్ పాయింట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

అంతా అనుకున్నట్లుగానే రెపో రేటు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది.

Update: 2022-12-07 05:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతా అనుకున్నట్లుగానే రెపోరేటు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపోరేటు 6.25 శాతానికి చేరింది. ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి సమావేశాలకు సంబంధించిన నిర్ణయాలను ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ప్రకటించారు. ఈ సమావేశాల్లో రాబోయే 12 నెలల్లో ద్రవ్యోల్బణం 4 శాతానికి మించి ఉంటుందని అంచనా వేశారు. అలాగే, ఆర్థిక సంవత్సరం 2023 కోసం GDP వృద్ధి అంచనా 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు.

ఈ పెంపుదలతో రుణాలు మరింత భారం కానున్నాయి. ఇప్పటివరకు ఈ ఏడాది 225 పాయింట్లకు పైగా ఆర్‌బిఐ రెపోరేటును పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికి భారత్ మాత్రం పటిష్టమైన స్థితిలో ఉందని శక్తికాంత దాస్ అన్నారు. కేంద్ర బ్యాంక్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ద్రవ్యోల్బణం అక్టోబర్-డిసెంబర్ 2022లో 6.6 శాతం, జనవరి-మార్చి 2023లో 5.9 శాతం, ఏప్రిల్-జూన్ 2023లో 5.0 శాతం, జులై-సెప్టెంబర్ 2023లో 5.4 శాతంగా ఉంటుందని కేంద్ర బ్యాంకు అంచనా వేసింది.

Similar News