5-డోర్ మహీంద్రా థార్ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే..
చాలా కాలంగా ఎదురు చూస్తున్న 5-డోర్ మహీంద్రా థార్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: చాలా కాలంగా ఎదురు చూస్తున్న 5-డోర్ మహీంద్రా థార్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. ఇది ఆగస్టు 15, 2024న అడుగుపెట్టబోతుందని సమాచారం. గతంలో మహీంద్రా 3 డోర్ మోడల్ను విడుదల చేయగా అది మంచి ఆదరణను దక్కించుకుంది. దాని ఆకట్టుకునే డిజైన్, పనితీరు కారణంగా అమ్మకాల పరంగా సరికొత్త మైలురాయికి చేరుకుంది. ఈ మోడల్ సక్సెస్ కావడంతో ఇదే వేరియంట్లో 5-డోర్ కలిగిన థార్ను తీసుకువస్తామని కంపెనీ గతంలో ప్రకటించింది. ఎప్పటికప్పుడు దాని అప్డేట్లను అందిస్తున్న కంపెనీ ఈ ఏడాదిలోనే ఈ మోడల్ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. 5-డోర్ల థార్ డిజైన్ సరికొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఇది కఠినమైన బాడీ, కొత్త వృత్తాకార LED హెడ్లైట్లు, పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్రూఫ్తో వస్తున్నట్లు సమాచారం. అలాగే భద్రత కోసం ఆరు ఎయిర్బ్యాగ్లు, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్తో పాటు మరిన్ని భద్రత ఫీచర్లను కూడా అందించినట్లు తెలుస్తుంది.