భారత మార్కెట్లో రెండో దశ విస్తరణకు సిద్ధమైన ఐకియా..!

ప్రముఖ ఫర్నీచర్ కంపెనీ ఐకియా భారత మార్కెట్లో విస్తరణపై దృష్టి సారించింది.

Update: 2023-09-03 11:24 GMT

హైదరాబాద్ : ప్రముఖ ఫర్నీచర్ కంపెనీ ఐకియా భారత మార్కెట్లో విస్తరణపై దృష్టి సారించింది. 2024 చివరి నాటికి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆన్‌లైన్ కార్యకలాపాలను ప్రారంభించడంతో పాటు దేశ వ్యాప్తంగా రిటైల్ ఫార్మాట్‌లో ఓమ్ని ఛానెళ్ల ఏర్పాటు ద్వారా దేశీయంగా రెండో దశ వృద్ధిని కొనసాగిస్తామని ఐకియా వెల్లడించింది. అదేవిధంగా తన నెట్‌వర్క్ పరిధిని పెంచి కొత్త స్టోర్లను ప్రారంభిస్తామని ఐకియా ఇండియా సీఈవో సుసానె పుల్వెరెర్ తెలిపారు.

పూణె, చెన్నై లాంటి మహా నగరాల్లో కూడా ఐకియా స్టోర్ల ఏర్పాటుతో పాటు లోకల్ సోర్సింగ్‌ను పెంచి ఉత్పత్తులను మరింత తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చే విధంగా కార్యకలాపాలను విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశీయంగా వ్యాపార వృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని సుసానె అన్నారు. రానున్న రోజుల్లో కనీసం ఐదు కొత్త స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రూ.10,500 కోట్ల పెట్టుబడులను ప్రకటించామని, మరో ఐదేళ్లలో మరింత వేగవంతమైన విస్తరణను చేపడతామని వెల్లడించారు. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News