ఫెస్టివల్ సీజన్‌లో Ola ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ తగ్గింపు

రైడ్ హియరింగ్ కంపెనీ ఓలా ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే..Latest Telugu News

Update: 2022-09-26 17:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైడ్ హియరింగ్ కంపెనీ ఓలా ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే పండగ సీజన్ సందర్భంగా వినియోగదారులకు తక్కువ ధరలో ఎలక్ట్రిక్ బైక్‌ను అందిస్తుంది. అసలు ధరపై రూ. 10,000 తగ్గింపుతో Ola S1 ప్రో ను వినియోగదారులకు అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 1.40 లక్షల (ఎక్స్-షోరూమ్). కానీ ఈ పండగల టైంలో EV బైక్‌ను రూ.10,000 తగ్గింపుతో వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఓలా ప్రకటించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 5(దసరా పండగ) వరకు ఉంటుంది. ఈ బైక్ కావాలనుకునే వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.

Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ARAI సర్టిఫైడ్ రేంజ్‌తో ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 185 కి.మీ. టాప్ స్పీడ్ 115 kmphని అందుకుంటుందని, అలాగే 3 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది. Ola S1 ప్రో గత ఏడాది ఆగస్టులో రూ.1,29,999కి లాంచ్ అయింది. కానీ ప్రస్తుతం దీని రూ.1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Similar News