కేంద్రం షాకింగ్ డెసిషన్.. భారీగా పెరగనున్న టూవీలర్ ధరలు

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ వాహనాలకు ఫేమ్-2 పథకం కింద ఇచ్చే సబ్సిడీలో కోత విధించాలని కేంద్రం నిర్ణయించింది.

Update: 2023-05-23 13:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ వాహనాలకు ఫేమ్-2 పథకం కింద ఇచ్చే సబ్సిడీలో కోత విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ స్కీమ్ కింద ప్రస్తుతం 1 కేడబ్ల్యూహెచ్‌కు రూ.15,000 సబ్సిడీ ఇస్తుండగా అందులో రూ.5 వేల తగ్గిస్తున్నట్లు మంగళవారం భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన సబ్సిడీ ఈ ఏడాది జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుుకనే అన్ని విద్యుత్ ద్విచక్ర వాహనాలకూ వర్తించనుంది. దీంతో విద్యుత్ ద్విచక్ర వాహనాలు మరింత ప్రియం కానున్నాయి.

Also Read..

ఎట్టకేలకు తొలి ఈవీ స్కూటర్‌ను విడుదల చేసిన సింపుల్ ఎనర్జీ! 

Tags:    

Similar News