ఎంట్రీ లెవల్ ఈవీపై రూ. 20 వేలు తగ్గించిన ఏథర్ ఎనర్జీ

ఈవీ స్కూటర్‌పై రూ. 20,000 వరకు తగ్గింపు ఆఫర్

Update: 2024-01-10 16:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన ఎంట్రీ లెవల్ మోడల్ 450ఎస్‌పై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీ తన ఈవీ స్కూటర్‌పై రూ. 20,000 వరకు తగ్గింపు ఆఫర్ ఇస్తున్నట్టు తెలిపింది. దాంతో ఏథర్ ఎనర్జీ 450ఎస్ మోడల్ ఈవీ స్కూటర్ బెంగళూరులో రూ. 1.09 లక్షలు, ఢిల్లీలో రూ. 97,500కే అందుబాటులో ఉండనుంది. కొత్త ధరలకు మారిన తర్వాత ఈ ఏడాదికి బజాజ్ చేతక్ ఆర్బన్ రూ. 1.15 లక్షలు, టీవీఎస్ ఐక్యూబ్ రూ. 1.23 లక్షలు, ఓలా ఎస్1 రూ. 1.20 లక్షల కంటే తక్కువకు 450ఎస్‌ లభించనుంది. అలాగే, 'ప్రో ప్యాక్'తో కూడిన 450ఎస్ మోడల్‌పై కంపెనీ రూ. 25,000 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ప్రో ప్యాక్‌తో కొనుగోలు చేసే వినియోగదారులు రైడ్ అసిస్ట్, ఏథర్ బ్యాటరీ ప్రోటెక్ట్, ఏథర్ స్టాక్ అప్‌డేట్, ఏథర్ కనెక్ట్(3 ఏళ్ల పాటు ఉచితంగా) వంటి వివిధ ఫీచర్లను పొందవచ్చు.  

Tags:    

Similar News