బ్లేడ్‌తో విద్యార్థినిపై దాడి..

      శ్రీకాకుళం జిల్లా రాజాంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సోమవారం పాఠశాలకు వెళ్తున్న పదోతరగతి విద్యార్థినిపై గుర్తుతెలియని దుండగుడు బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఆ బాలిక అలాగే పాఠశాలకు వెళ్లింది. రక్తస్రావంతో వచ్చిన విద్యార్థినిని గమనించిన తోటి విద్యార్థులు విషయాన్నిఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా,విషయం బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్యం జాగ్రత్త వహించింది.అయితే బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు […]

Update: 2020-02-09 23:45 GMT

శ్రీకాకుళం జిల్లా రాజాంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సోమవారం పాఠశాలకు వెళ్తున్న పదోతరగతి విద్యార్థినిపై గుర్తుతెలియని దుండగుడు బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఆ బాలిక అలాగే పాఠశాలకు వెళ్లింది. రక్తస్రావంతో వచ్చిన విద్యార్థినిని గమనించిన తోటి విద్యార్థులు విషయాన్నిఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా,విషయం బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్యం జాగ్రత్త వహించింది.అయితే బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News