హుజురాబాద్ ‘ఈటల’దే.. ఇది ప్రజాస్వామ్య విజయం

దిశ, డైనమిక్ బ్యూరో : అధికార టీఆర్ఎస్ పార్టీపై భారీ విజయం సాధించిన ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అభినందనలు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈటలకు ఓటు వేసి గెలిపించిన హుజురాబాద్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఉపఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా భారీగా డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు. ఈ విజయం కోసం శాయశక్తులా కృషి చేసిన కార్యకర్తలకు, […]

Update: 2021-11-02 07:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : అధికార టీఆర్ఎస్ పార్టీపై భారీ విజయం సాధించిన ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అభినందనలు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈటలకు ఓటు వేసి గెలిపించిన హుజురాబాద్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఉపఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా భారీగా డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు. ఈ విజయం కోసం శాయశక్తులా కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News