దుబ్బాకలో గెలవడం ఆయనకే ఇష్టం లేదు…

దిశ, వెబ్ డెస్క్: దుబ్బాకలో గెలవడం సీఎం కేసీఆర్ కే ఇష్టం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా చేగుంటలో భారీ బైక్ ర్యాలీని బీజేపీ శ్రేణులు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….టీఆర్ఎస్‌కు దుబ్బాక ఓటర్లు తగిన బుద్ది చెబుతారని ఆయన అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమిని సాకుగా చూపి హరీశ్ రావును పక్కన బెట్టి కేటీఆర్‌ను సీఎం చేయడానికి […]

Update: 2020-11-01 02:38 GMT

దిశ, వెబ్ డెస్క్:
దుబ్బాకలో గెలవడం సీఎం కేసీఆర్ కే ఇష్టం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా చేగుంటలో భారీ బైక్ ర్యాలీని బీజేపీ శ్రేణులు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….టీఆర్ఎస్‌కు దుబ్బాక ఓటర్లు తగిన బుద్ది చెబుతారని ఆయన అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమిని సాకుగా చూపి హరీశ్ రావును పక్కన బెట్టి కేటీఆర్‌ను సీఎం చేయడానికి కేసీఆర్ పథకం వేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ తన 300 ఎకరాల్లో దొడ్డు వడ్లు పండించారని ఆయన అన్నారు. రైతులకు మాత్రం సన్నాలు పండించాలని చెప్పారని ఆయన తెలిపారు. సీఎం మాటలతో రైతులు మోస పోయారని ఆయన తెలిపారు.

Tags:    

Similar News