రంజాన్‌కు లేని ఆంక్షలు..బోనాలకెందుకు: రాజాసింగ్

దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తూ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రంజాన్‌ సమయంలో ఎలాంటి ఆంక్షలు విధించకుండా వదిలేసిన ప్రభుత్వం ఇప్పుడు బోనాల పండగకు ఎందుకు పెడుతుందని ప్రశ్నించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలు పాటిస్తూ ప్రభుత్వం బాధ్యతగా పండగ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. చారిత్రక బోనాల పండగకు ఏర్పాట్లు చేయడానికి వెంటనే మార్గదర్శకాలను విడదల చేయాలన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ సాకుతో […]

Update: 2020-06-17 07:42 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తూ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రంజాన్‌ సమయంలో ఎలాంటి ఆంక్షలు విధించకుండా వదిలేసిన ప్రభుత్వం ఇప్పుడు బోనాల పండగకు ఎందుకు పెడుతుందని ప్రశ్నించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలు పాటిస్తూ ప్రభుత్వం బాధ్యతగా పండగ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. చారిత్రక బోనాల పండగకు ఏర్పాట్లు చేయడానికి వెంటనే మార్గదర్శకాలను విడదల చేయాలన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ సాకుతో ఉద్యోగుల జీతాల చెల్లింపులు ఆపడానికి తెచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. బుధవారం ఎమ్మెల్సీ రామచందర్‌రావుతో కలిసి సోషల్ మీడియా వేదికగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

Tags:    

Similar News