27 రోజులుగా దీక్ష… పట్టించుకోని ప్రభుత్వం

దిశ, మునుగోడు: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో చేస్తున్న నిరాహార దీక్షలు బుధవారంతో 27వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని బుధవారం జిల్లా బీజేపీ అధ్యక్షులు పీవీ శ్యామ్ సుందర్ సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అంగీకరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్మికులు 27 రోజులుగా దీక్ష చేస్తున్నా… […]

Update: 2020-08-26 07:25 GMT

దిశ, మునుగోడు: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో చేస్తున్న నిరాహార దీక్షలు బుధవారంతో 27వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని బుధవారం జిల్లా బీజేపీ అధ్యక్షులు పీవీ శ్యామ్ సుందర్ సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అంగీకరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్మికులు 27 రోజులుగా దీక్ష చేస్తున్నా… ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటం ఆందోళనకరం అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి వెంటనే రూ.వెయ్యికోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాలలో నిల్వ ఉన్న వస్త్రాలను వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.

Tags:    

Similar News