కరోనాతో బీజేపీ నేత మనోజ్ మిశ్రా మృతి

లక్నో: దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి బారినపడి మరణిస్తున్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా యూపీలో బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రా కరోనాతో సోమవారం మృతిచెందారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన కాన్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 2.30 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. మిశ్రా మృతి పట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మిశ్రా కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని […]

Update: 2021-05-03 00:17 GMT

లక్నో: దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి బారినపడి మరణిస్తున్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా యూపీలో బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రా కరోనాతో సోమవారం మృతిచెందారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన కాన్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 2.30 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. మిశ్రా మృతి పట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మిశ్రా కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tags:    

Similar News