ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా ఆశోక్‌కుమార్‌

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ, దుబ్బాక ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఎం.అశోక్‌కుమార్‌ను పునర్:నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ గతంలో మూడేళ్లపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా పనిచేశారు. జులై 10తో పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం తాజాగా మరోసారి ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. అయితే ఆయన ఈ పదవిలో 2021 డిసెంబరు 31వరకు కొనసాగనున్నారు. […]

Update: 2020-10-13 02:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ, దుబ్బాక ఉప ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఎం.అశోక్‌కుమార్‌ను పునర్:నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ గతంలో మూడేళ్లపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా పనిచేశారు. జులై 10తో పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం తాజాగా మరోసారి ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. అయితే ఆయన ఈ పదవిలో 2021 డిసెంబరు 31వరకు కొనసాగనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News