AP News: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తమ ఉత్తర్వులను ఖాతరు చేయని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు వారం రోజులపాటు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే ఏపీ ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‍లకు 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏప్రిల్‌లో హైకోర్టు ఆదేశించింది. అయితే అప్పటి నుంచి రెగ్యులరైజ్ చేయకపోవడంతో పలుమార్లు ఉత్తర్వులు అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించడంతో మంగళవారం ఐఏఎస్ అధికారులు […]

Update: 2021-06-22 05:27 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తమ ఉత్తర్వులను ఖాతరు చేయని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు వారం రోజులపాటు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే ఏపీ ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‍లకు 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏప్రిల్‌లో హైకోర్టు ఆదేశించింది. అయితే అప్పటి నుంచి రెగ్యులరైజ్ చేయకపోవడంతో పలుమార్లు ఉత్తర్వులు అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించడంతో మంగళవారం ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్‌లు వ్యక్తిగతంగా హాజరయ్యారు. దీంతో వారిని మందలించిన హైకోర్టు వారం రోజులు జైలు శిక్ష విధించింది.

Tags:    

Similar News