నాన్న గొప్పతనాన్ని అమ్మ ఆవిష్కరించారు: జగన్

దిశ, ఏపీ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, దివంగత రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన నేపథ్యంలో ఆయన సతీమణి విజయమ్మ రాసిన ‘నాలో..నాతో..వైఎస్సార్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నాన్న జయంతిని పురస్కరించుకుని అమ్మ.. నాన్నను చూసిన విధంగా..”నాలో.. నాతో వైఎస్‌ఆర్‌” రచన చేశారు. గొప్ప రాజకీయ నేతగా అందరికీ పరిచయం అయిన వ్యక్తి వైఎస్సార్‌. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని అమ్మ […]

Update: 2020-07-08 01:03 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి, దివంగత రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన నేపథ్యంలో ఆయన సతీమణి విజయమ్మ రాసిన ‘నాలో..నాతో..వైఎస్సార్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నాన్న జయంతిని పురస్కరించుకుని అమ్మ.. నాన్నను చూసిన విధంగా..”నాలో.. నాతో వైఎస్‌ఆర్‌” రచన చేశారు. గొప్ప రాజకీయ నేతగా అందరికీ పరిచయం అయిన వ్యక్తి వైఎస్సార్‌. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని అమ్మ ఆవిష్కరించారు. ఇది ఒక మంచి పుస్తకం’అని పేర్కొన్నారు.

Tags:    

Similar News