కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న సీఎం జగన్‌‌

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. గుంటూరులోని భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్‌ భారతితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్..‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అనంతరం వార్డు/గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత జగన్, భారతి దంపతులు అరగంట పాటు అబ్జర్వేష‌న్‌లో ఉంటారు. అనంతరం సచివాలయంలో వైద్యులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత తదితర అంశాలపై చర్చించనున్నారు.

Update: 2021-04-01 00:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. గుంటూరులోని భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్‌ భారతితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్..‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అనంతరం వార్డు/గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత జగన్, భారతి దంపతులు అరగంట పాటు అబ్జర్వేష‌న్‌లో ఉంటారు. అనంతరం సచివాలయంలో వైద్యులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత తదితర అంశాలపై చర్చించనున్నారు.

Tags:    

Similar News