Kadapa: కరడుగట్టిన ఇద్దరు దొంగల అరెస్టు.. వీరిపై కేసులెన్నో తెలిస్తే షాకే

వైయస్సార్, మైదుకూరు రూరల్ పరిధిలో ఇద్దరు కరుడుగట్టిన అంతర్‌రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు..

Update: 2023-03-25 12:52 GMT

దిశ,కడప: వైయస్సార్, మైదుకూరు రూరల్ పరిధిలో ఇద్దరు కరుడుగట్టిన అంతర్‌రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.  వారి నుండి రూ.10.05 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 42 చోరీ కేసులున్నాయి. వై.ఎస్.ఆర్ జిల్లాలో 28 కేసులు, కర్నూలు జిల్లాలో 8, గుంతకల్ రైల్వే పరిధిలో రెండు, తెలంగాణలో 4 కేసులు ఉన్నాయని ఎస్పీ అంబురాజన్ తెలిపారు. 

Tags:    

Similar News