Kadapa: ముగ్గురు గంజాయి వ్యాపారుల అరెస్ట్

కడపలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు...

Update: 2023-05-21 15:20 GMT

దిశ,కడప: కడపలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సిద్ధవటం మండలం దిగువపేటకు చెందిన శ్రీరాం నరసింహులు, సిద్ధవటం ప్రభుత్వ వైన్ షాప్‌ సేల్స్ బాయ్‌ కోటపాటి ప్రేమ్ కుమార్, సిద్ధవటం మండలం కొత్త మాధవరం చెందిన కందుల సాయినాథ్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరంతా కడప రామరాజు పల్లి హరిజనవాడలో నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు.  వీరిని కడప నగరం, రామరాజుపల్లి, ఫాతిమా మెడికల్ కాలేజ్ దగ్గర రైల్వే ట్రాక్ ప్రక్కన కంపచెట్ల మధ్యలో రహస్యంగా గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నామన్నారు. నిందితులు రైలు బోగీలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి ప్యాకెట్లతో ఉన్న మూడు సంచులను తాము స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇది వరకు గంజాయి కేసుల్లో అరెస్ట్ అయిన నిందితులపై నిరంతర నిఘా పెట్టామని చెప్పారు ఎక్కువ కేసులు ఉన్న వారిపై పీడీ కేసులు నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News