రేపో.. మాపో జైలుకు అవినాశ్ రెడ్డి.. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రేపో మాపో ఎంపీ అవినాశ్ రెడ్డి జైలుకు వెళతారని వైఎస్ సునీత చెప్పారు....

Update: 2024-05-09 08:08 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో రేపో మాపో ఎంపీ అవినాశ్ రెడ్డి జైలుకు వెళతారని వైఎస్ సునీత చెప్పారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ షర్మిలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనాల్లో ఉండే నాయకులు రావాలని, జైలుకు పోయే అవినాశ్ రెడ్డి లాంటి వ్యక్తులు కాదని సునీత పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైఎస్ షర్మిలను గెలిపించాలని, అప్పుడే వివేకా ఆత్మకు శాంతి కలుగుతుందని తెలిపారు. వివేకా హత్య విషయంలో తాము న్యాయం కోసం పోరాడుతున్నామని, కానీ ప్రజా తీర్పు చాలా పెద్దన్నారు. ప్రజా తీర్పు కోసమే వైఎస్ షర్మిల ఎంపీ బరిలోకి దిగారని వైఎస్ సునీత పేర్కొన్నారు. 

Similar News