ఏదో అనుకుంటే మరేదో జరిగింది.. మైక్ ఇచ్చి మరీ పరువు తీయించుకున్న షర్మిల

కడపలో యువకుడి దెబ్బకు వైఎస్ షర్మిల కంగుతిన్నారు..

Update: 2024-04-08 13:51 GMT

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా మైదుకూరు పర్యటనలో వైఎస్ షర్మిల షాక్ తగిలింది. సీఎం జగన్‌పై విమర్శలతో విరుచుకుపడుతున్న ఆమెకు యువకుడు ఝలక్ ఇచ్చారు. షర్మిల మాట్లాడుతుండగా యువకుడు జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. జగన్ పథకాలను చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో దమ్ముంటే మైక్‌లో మాట్లాడాలని దగ్గరికి పిలిచి మరీ షర్మిల మైక్ ఇచ్చారు. మైక్ తీసుకున్న వెంటనే ఆ యువకుడు వైఎస్ జగన్ చేసిన మంచిని వివరించారు. కడప యువకులకు చెప్పినవన్నీ జగన్ చేశాడని చెప్పారు. పాదయాత్రలో ప్రజలకు అండగా ఉంటానని జగన్ చెప్పారని.. ఇవాళ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. దాంతో ఆమె ఖంగుతిన్నారు. ఏమీ మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీంతో వైఎస్ షర్మిలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. మైక్ ఇచ్చి మరీ పరువు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. జగనన్న పాలనలో ఈ రాష్ట్రంలో ప్రతీ సామాన్యుడికి మంచి జరిగిందని, అందుకే సామాన్యులే జగనన్నకి స్టార్ క్యాంపెయినర్లు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏ మూలకి పోయి, ఎవరిని అడిగినా ఇలానే గర్వంగా మాట్లాడగలుగుతారమ్మా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 

Tags:    

Similar News