మంత్రి విశ్వరూప్ కుటుంబంలో టికెట్ వార్

ఏపీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో తండ్రీకొడుకుల మధ్య టికెట్ వార్ చెలరేగింది..

Update: 2023-12-31 11:09 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో తండ్రీకొడుకుల మధ్య టికెట్ వార్ చెలరేగింది. అధిష్టానం కొడుకు టికెట్ కన్ఫామ్ చేసింది. అయితే తండ్రి కూడా బరిలో ఉంటానని ప్రకటించారు. దీంతో ఆ నియోజకర్గం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రీకే సపోర్ట్ చేస్తామంటూ ప్రకటించారు. ఈ పరిస్థితి అమలాపురంలో వైసీపీలో నెలకొంది. ఇక్కడ నుంచి మంత్రిగా విశ్వరూప్ ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన తనయుడు శ్రీకాంత్ కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే శ్రీకాంత్‌కే అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ఆయన తండ్రి విశ్వరూప్ కూడా పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. దీంతో తండ్రి విశ్వరూప్, తనయుడు శ్రీకాంత్ మధ్య టికెట్ వార్ తలెత్తింది. మరోవైపు నియోజకవర్గం వైసీపీ సీనియర్ కార్యకర్తలు మాత్రం తండ్రి విశ్వరూప్‌కే మద్దతు ఇస్తామంటున్నారు. తనయుడు శ్రీకాంత్‌కు టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. మరి తండ్రి కొడుకుల మధ్య తలెత్తిన టికెట్ వార్‌ను వైసీపీ అగ్ర నాయకులు ఏ విధంగా చల్లబరుస్తారో చూడాలి. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News