AP News:ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలని కౌలు రైతుల సంఘం డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

Update: 2024-05-24 14:47 GMT

దిశ,పశ్చిమగోదావరి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ సమావేశం భీమవరంలోని ఉపాధ్యాయ కార్యలయంలో కేతా గోపాలన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు వ్యవసాయం చేసేదంతా కౌలురైతులేనన్నారు.

వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆసరా లేకపోయినా అధిక వడ్డీలకు ప్రయివేటు అప్పులు తేచ్చి పంటలు పండిస్తున్నరన్నారు. ప్రభుత్వం నెలల తరబడి డబ్బులు వేయకపోతే కౌలు రైతుల కష్టార్జితం అంతా అప్పుల వడ్డీలకే సరిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ధాన్యం డబ్బులు విడుదల చేయడంతో పాటు పంట కాలువలు, మురుగు కాలువల ఆధునీకరణకు నిదులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రామాంజనేయులు, సభ్యులు పి.నరసింహమూర్తి, సిహెచ్ శ్రీనివాస్, కె.శ్రీనివాస్, ఎ.సత్యనారాయణ, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Similar News