సరిహద్దు ఘర్షణ...గొడ్డలితో దాడి

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గుండుగూడెంలో ఇద్దరి మధ్య స్థలం సరిహద్దుల్లో ఘర్షణ తలెత్తింది..

Update: 2023-02-13 15:44 GMT

దిశ,కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గుండుగూడెంలో ఇద్దరి మధ్య స్థలం సరిహద్దుల్లో ఘర్షణ తలెత్తింది. గ్రామానికి చెందిన సోడే.రాముడు, కారం రాముడు మధ్య గొడవ జరిగింది. దీంతో కారం రాముడిపై సోడే రాముడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కుక్కునూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News