AP Politics:వలంటీర్ల వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు:నారా లోకేష్
ఎన్నికల వేళ పలు నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి యువనేత లోకేష్ సమక్షంలో చేరారు.
దిశ,వెబ్డెస్క్: ఎన్నికల వేళ పలు నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి యువనేత లోకేష్ సమక్షంలో చేరారు. పార్టీలోకి చేరిన వారందరికీ లోకేష్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ..వలంటీర్ల వేతనాలను రెట్టింపు చేస్తామని టీడీపీ నేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 9 మంది వలంటీర్లు టీడీపీలో చేరారని ఆయన తెలిపారు. వలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వారి భవిష్యత్తుకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. కేవలం పెన్షన్లే కాకుండా ఇతర సంక్షేమ పథకాలు కూడా రాబోయే రోజుల్లో వలంటీర్ల ద్వారా అందజేస్తామన్నారు.