AP Politics:వలంటీర్ల వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు:నారా లోకేష్

ఎన్నికల వేళ పలు నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి యువనేత లోకేష్ సమక్షంలో చేరారు.

Update: 2024-04-17 15:27 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ పలు నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి యువనేత లోకేష్ సమక్షంలో చేరారు. పార్టీలోకి చేరిన వారందరికీ లోకేష్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ..వలంటీర్ల వేతనాలను రెట్టింపు చేస్తామని టీడీపీ నేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 9 మంది వలంటీర్లు టీడీపీలో చేరారని ఆయన తెలిపారు. వలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వారి భవిష్యత్తుకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. కేవలం పెన్షన్లే కాకుండా ఇతర సంక్షేమ పథకాలు కూడా రాబోయే రోజుల్లో వలంటీర్ల ద్వారా అందజేస్తామన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News