Kothavalasa: చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం.. దిష్టి బొమ్మ దహనం

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు...

Update: 2023-05-22 12:20 GMT

దిశ కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు. సీఎంకి విలువ ఇవ్వలేని వ్యక్తి చంద్రబాబునే పెద్ద సైకో అని నినదించారు. కొత్తవలస మూడు రోడ్ల జంక్షన్‌లో చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. లేదంటూ తాము కూడా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి  వస్తుందని హెచ్చరించారు. 

Tags:    

Similar News