పవన్ కల్యాణ్ విజయనగరం షెడ్యూల్ ఇదే..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం విజయనగరంలో పర్యటించనున్నారు. గుంకలాం గ్రామం..Pawan Kalyan Vizianagaram Schedule

Update: 2022-11-12 16:39 GMT

దిశ వెబ్ డెస్క్: జగసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఆదివారం విజయనగరం (Vizianagaram)లో పర్యటించనున్నారు. గుంకలాం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన జగనన్న లేవుట్‌ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడతారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ విశాఖ నోవాటెల్‌లో ఉన్నారు. ఈ రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయాన్నే విశాఖ నుంచి విజయనగరానికి బయల్దేరి వెళ్తారు. ఉదయం 10 గంటల సమయంలో గుంకలాం సమీపంలోని జగనన్న లేవుట్ వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటారు. ఈ మేరకు పవన్ పర్యటనకు జనసేన నాయకులు (Janasena Leaders) అన్ని ఏర్పాట్లు చేశారు. వపన్ కల్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) పర్యటించే అవకాశం ఉంది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆడంబరంగా ప్రభుత్వం.. జగనన్న ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అనతికాలంలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేసింది. అలాగే ఇళ్ల పొజిషన్‌ను సైతం చూపి తామే కట్టిస్తామని హామీ ఇచ్చింది. దీంతో లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఇళ్ల నిర్మాణాలు ఎక్కడ వేసిన గంగొళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయాయి. అంతేకాదు ఎక్కడా ఇళ్లు పూర్తి అయిన దాఖలాలు కూడా కనిపించడంలేదు.. కొన్ని చోట్ల అసలు నిర్మాణాలే చేపట్టలేదని.. మరికొన్ని చోట్ల కొంతమేర పనులు జరగాయని లబ్ధిదారులు అంటున్నారు. త్వరగా ఇళ్లు పూర్తి చేసి తమకు అందజేయాలని కోరుతున్నారు. అయితే ఈ సమస్యలపై జనసేన పార్టీ దృష్టి సారించింది. దీంతో పవన్ కల్యాణ్ జగనన్న లేఅవుట్లను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం విజయనగరం పర్యటకు వెళ్తున్నారు. అక్కడ లబ్ధిదారులతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం విమర్శలు చేసే అవకాశం ఉంది.

Similar News